పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి
భక్తులు రాజమండ్రి నగరానికి పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న
కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను. ముందుగా కొన్ని
విషయాలని ప్రస్థావిస్తాను. పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న
టపా
ద్రాక్షారామము నుండి 10 కి.మీ దూరములో గోదావరి నది ఒడ్డున ఉన్న క్షేత్రము. ఇక్కడ
సోమేశ్వర, జనార్ధన
స్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి. . కాకినాడ నుండి కోటిపల్లి రైల్
కారులో ప్రయాణం.. పచ్చటి పంట పొలాలు
కాలువలు పిల్ల కాలువలు కొబ్బరి తోటలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ
ప్రయాణములో బాపు గారిని తల్చుకోకుండా ఉండలేము. ప్రయాణం
ఒక గంటన్నర పడుతుంది. కానీ కోటిపల్లి స్టేషన్ నుండి కోటిపల్లి రేవు దూరం ఆటో
దొరికితే అదృష్టమే.....
కోటిపల్లి పూర్వ నామము సోమప్రభాపురము. ఈ
క్షేత్రములో చయా సోమేశ్వరుడు,
కోటేశ్వరుడు, సిద్ధి జనార్ధన
స్వామి, శ్రీ
శ్రీ శ్రీ రాజేశ్వరీ దేవి వారలు కొలువైన
ఉన్నారు. ఆ ప్రభావము వలన ఇచట భక్తి శ్రద్ధలతొ చేయు స్నాన, దానముల వలన భక్తులు
సుకృత, దుష్కృతములకు
కోటి రెట్లు ఫలితము పొందెదరు. కోటీశ్వరుని ప్రభావము వలననే ఈ క్షేత్రమునకు కోటి ఫలి
, కోటి
తీర్థము అని పేర్లు వచ్చాయి. కాల క్రమేణా అవి కోటిపల్లి అయింది. ఈ కోటి పల్లి
కాకినాడకు 30 కి.మి
దూరములో ఉన్నది. ద్రాక్షారామము,
కోటిపల్లి, ముక్తేశ్వరము, అయినవిల్లి, మురమళ్ళ క్షేత్రాలని
ఒక్క రోజులో దర్శించవచ్చు.(మనం సమకూర్చుకునే ప్రయాణ సాధనాన్ని బట్టి ఉంది.)
No comments:
Post a Comment