Saturday, 20 June 2015

ముక్తేశ్వరం

 పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి  టపా ప్రారంభిస్తున్నాను. . పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో 10వ రోజు టపాగా
ముక్తేశ్వరం
కోటిపల్లి రేవుకిఅవతలై వైపున అంటే గోదవారి నదికి అవతలి ఒడ్డున 3 కి.మీ దూరం లో ముక్తేశ్వరం ఉంది. అమలాపురానికి 14 కి.మీ. దూరంలో గోదావరి తీరంలో ఉన్న పుణ్య క్షేత్రం ఈ ముక్తీశ్వరం(ముక్తేశ్వరం).ఇక్కడ, ముక్తి కాంతా సమేత క్షణ ముక్తేశ్వర స్వామి దేవాలయముఉంది.ఇక్కడి ఈశ్వరుడు వీక్షించినంత మాత్రాన క్షణంలో ముక్తిని ప్రసాదిస్తాడని నమ్మిక.ఈ ఆలయానికి ఎదురుగా ఒక దేవాలయం ఉంది. అది శ్రీరాజ రాజేశ్వరీ సమేత ముక్తేశ్వర స్వామి ఆలయము. 




No comments:

Post a Comment