పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి
భక్తులు పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి
తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని
పరిచయం చెయ్యడానికి ఈ టపా
అయినవిల్లి
కాకినాడకు 72 కి.మీ.(వయ యానం,అమలాపురం, ముక్తేశ్వరము) సిద్ధి వినాయక
దేవాలయము చూడవలసిన దేవాలయం.ముక్తేశ్వరము నుండి 2 కి.మీ
ఇచ్చటి
వరసిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడుగా ఉంటాడు. దక్షప్రజాపతి తాను చెయ్యబోయే
యజ్ఞానికి ముందు ఈ గణపతిని ఆరాధించాడని ఒక కధ ప్రచారములో ఉంది.. ఈ ఆలయ
ప్రాకారములోనే అయ్యప్పస్వామి ఆలయము, అన్నపూర్ణాదేవి ఆలయము, విశ్వేశ్వరాలయము, కాలభైరవుని ఆలయము
ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు
అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈ సిద్ధి వినాయకుని స్మరించి ఏకార్యము తలపెట్టినా
నిర్విఘ్నముగా జరుగుతుంది అని భక్తులకు అపారమైన నమ్మిక.


No comments:
Post a Comment