పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి
భక్తులు పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి
తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని
పరిచయం చెయ్యడానికి ఈ టపా
మురమళ్ళ
శ్రీభద్రకాళీ
సమేత వీరేశ్వర స్వామి ఆలయము ఉంది. కాకినాడ నగరానికి 45 కి.మీ
దూరములో ఉంది.. ప్రతిరోజూ ఈ స్వామికి కల్యాణము జరుగుతుంది. కల్యాణము
జరిపించుకోదలచిన భక్తులు వారి వారి జన్మ నక్ష్త్రములననుసరించి జరిపించుకోవాలి.
అందుకు గాను దేవస్థానము వారు ఆన్ లైన్ లో అన్ని వివరములు పొందుపరిచారు. ఈ స్వామి కళ్యాణ కారకుడు. పెళ్ళి
కావలసిన వాళ్ళు ఇక్కడికొచ్చి కళ్యాణము చేయించుకుంటారు వారి వారి నక్షత్రములను
అనుసరించి. రోజుకి 51 మందికి
మాత్రమే. అమలాపురానికి 20 కి.మీ.
దూరములో ఉన్న ఈ క్షేత్రము వివరమ్య్ల కొరకు ఈ క్రింది వెబ్
సైట్ చూడగోర్తాను. http://sriveereswaraswamytemple.com/ దేవస్థానము వారు ఇంటెర్నెట్ లో
పెట్టిన సైట్ చూపించిన ఫొటోఈ క్రింద
విధముగా ఉంటుంది.

No comments:
Post a Comment