పవిత్ర గోదావరి నది
పుష్కరాల సందర్భముగా తూర్పు గోదావరి జిల్లాలలోని వివిధ ఆలయాలని ముఖ్య ప్రదేశాలని
పరిచయం చేద్దామని ఈ టపా.
అన్నవరానికి 25
కి.మీ దూరములో, తుని పట్టణానికి 10 కి.మీ దూరములో, జాతీయ రహదారికి (విశాఖ-రాజమండ్రి) 2 కి.మీ ల దూరములో పచ్చటి ప్రకృతి సౌందర్యముతొ
అలరారుతుంది ఈ క్షేత్రము. ఇక్కడి అమ్మవారిని తలుపులమ్మ అని పిలుస్తారు. తలచినంత
మాత్రాన మన తలపులను గ్రహించి కోర్కెలను తీర్చే తల్లి గనుక ఆవిడ తలుపులమ్మ అయింది.
రెండు కొండలమధ్యన ఒక పర్వత సానువులపై వెలసిన అమ్మవారు. లోయ కాలగతి లో
లోవగా మారింది. ఈ ఆలయానికి మెట్ల దారి గుండా లేదా కొండ పైకి
ఉన్న రహదారి మార్గముగుండా చేరుకుని చల్లని
తల్లిని దర్శించుకోవచ్చు. నిత్యమూ రద్దీగా ఉంటుంది ఈ క్షేత్రము.
No comments:
Post a Comment