Monday, 22 August 2016

మహాభారతం లో భీష్ముడు (శాంతి పర్వము)

21/08/2016 తేదీన జరిగిన బ్రహమశ్రీ చాగంటి వారి ప్రసంగములో భీష్ముడు ధర్మజునితో రాజా సంకల్పముల వలన కామము(కోర్కెలు) కలుగుతాయి. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. ధర్మ బద్ధమా అధర్మమా, ఇది మంచిదా చెడుదా అని చూడకుండా ప్రతిపాదిస్తూ ఉంటుంది. మనిషి వీటిలో దేనిమీద అయినా అనురక్తుడయ్యడనుకోండి, మనస్సు ఈ శరీరాన్ని పట్టుకుని తన కోరిక తీర్చుకుంటుంది. మనిషిని అఢః పాతాళానికి తోశేస్తుంది. అందుకని మనసుపై అజమాయిషీ కలిగి ఉండు. అది సాధన వలన మాత్రమే కలుగుతుంది. మనసు ప్రీతితో కానీ అప్రీతితో కాని మాట వింటుంది. ఒక రోజు ఒక మంచి పని చేద్దామని అనిపిఉంచగానే మనసు ముందు ఆ పనిలో ఉన్న కష్టాలని చెబుతుంది. దాని మాట వినకుండా మీరు మీ ప్రతిపాదనకే మొగ్గు చూపారనుకోండి అది యేమీ అనదు. మరునాడు అంటే.. అలా నాలుగు రోజులు మంచి పని వైపు మీరు జరిగితే  అయిదవనాడు మనస్సే ఇంకా బయలుదేరలేఅదేమిటి. ఆ మంచి పని చెయ్యాలి అని చెబుతుంది. ఇది సాధనతో మాత్రమే వీలవుతుంది. అని మనస్సు నియంత్రించుకోవడం ఎలా అన్న విషయం మీద ఎన్నో ఉదాహరణలతో చక్కగా వివరించారు.
   మనిషికి కోపము ఎందుకు వస్తుంది. దానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తన కోరిక తీరకపోతే కారణం వెతికి కోరిక తీరకపోవడానికి కారణమైన దాని మీద కోపము పెంచుకుంటుంది. రెండవది ఇతరులు యేది తప్పు చేశారు అన్న భావన. మనసు క్రోధానికి వశపడ కుండా ఉండాలంటే మనిషి ఓర్పు అలవరచుకోవాలి అది ఎలా సాధించాలి అన్నది భీష్ముడు చెప్పగా వ్యాసుడు వ్రాయగా తిక్కన తెనిగించగా పూజ్వ గురువులు నాలాంటి వారికి అర్ధమయ్యే రీతిలో చక్కగా చెప్పారు. తదుపరి భీష్ముడు ధర్మజునితొ చెప్పిన్ నాడీ ఝంభుని వృత్తాంతము, హంసగీతి కూడా చెప్పారు. ఇది విన్నంత సేపూ ఆహా ఓహో అని పిస్తుంది అర్ధమైన దానిలా కనపడుతుంది. తీరా ప్రసంగం అయిపోయి ఇంటికి బయలుదేరగానే ఈ రోజు ఏమి చెప్పారు అని ఆలోచిస్తే....... ఏదీ జ్ఞాపకం రాదు. 

Saturday, 20 August 2016

భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మములు చెప్పుట

05/2016 నుండి మహభారతంలో వివిధ పాత్రలు అనే శీర్షిక క్రింద బ్రహ్మశ్రీ చాగంటి కోతేశ్వరరావు గారు చేస్తున్న ప్రవచన కార్యక్రమము లో భీష్మాచార్యులవారి గురించి వారు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మములు చెపుతున్న (శాంతి పర్వము) సంఘటన జరుగుతోంది. భీష్మ పితామహులు ధర్మరాజుతో ఆశ్రమ ధర్మాలు చెబుతున్నారు. 1. బ్రహ్మచర్యాశ్రమము, 2. గృహస్తాశ్రమము, 3.వానప్రస్థాశ్రమము, 4. సన్యాశాశ్రమము. ఈ నాలుగు ఆశ్రమములలోను అత్యంత ఉత్తమమైన ఆశ్రమము గృహస్తాశ్రమము. మిగిలిన మూడు ఆస్రమములు ఈ గృహస్తాశ్రమముని ఆశ్రయించే ఉంటాయి. గృహస్తు విత్తము ఆర్జించి, ఆ ధనాన్ని 5భాగములు చేసి 1భాగము ధర్మముకొరకు, రెండవభాగము కీర్తికొరకు, మూడవది లోకిక వ్యవహారముల కొఱకు, నాలగవ భాగము తన కొరకు అంటే తన జీవుని ఉధరణ కొరకు, అయిదవ భాగము స్వజనుల కొరకు.  
  భీష్ముడు ధర్మరాజుతో రాజా ఇవన్నీ ఎవరి వలన వృద్ధి చెందుతాయో తెలుసా.. అవి రాజు వలననే వృద్ధి చెందుతాయి. అని రాజుకు ఉండవలసిన గుణములు చెబుతాడు.

అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు శాంతి పర్వము

అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వద్దకు ధర్మ సూక్ష్మాలను తెలుసు కోవడానికి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా వచ్చాడు. భీష్ముడు రాజు ఎలా ఉండాలి రాజు వద్ద ఉండే కార్య నిర్వాహకులు ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలి, అందునా గృహస్తు ఎలా ఉండాలి అనేవి నేటి వరకూ  పూజ్వ గురువుల ప్రసంగంలో చెప్పారు. అనివార్య కారణాల వలన నేను ప్రవచనం వినలేక పోవడం వలన ప్రసంగ పాఠాన్ని టూకీగా చెప్పాను.  

Monday, 15 August 2016

కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం ఎందుకు పట్టుకున్నారు.

కురుక్షేత్ర యుద్ధము మోదలైన తరువాత రెండవ రోజు యుద్ధములో పాండవులు అత్యుత్సాహముతో యుద్ధం చేస్తున్నారు. సమయములో వారికి దుర్యోధనుడు కనపడ్డాడు. అతణ్ణి చూడగానే భీముడు అరివీర భయంకరుడిలా విరుచుకు పడ్డాడు. దుర్యోధనుడి ఆయుధాలని విరిచెయ్యడమే కాకుండా అతడు స్పృహ కోల్పోయేటట్లు చేశారు. అప్పుడు సారధి రధిని రక్షించుకోవడానికి రధాన్ని యుద్ధభూమి నుండి తప్పించాడు. ఆరోజు యుద్ధం పూర్తి అయింది. ఆనాటి రాత్రి దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని ఉద్దేసించి మాట్లాడుతూ మీరు పాండవ పక్షపాతులు అందుకే వారు విజౄంభిస్తుంటే మిన్నకుండి పోయారు. కనీసం రాజైన నన్ను రక్షించలేని స్థితిలో ఉన్నారు…  మిమ్ములను నమ్ముకుని నేను యుద్ధానికి వచ్చాను. మీగురించి ముందే తెలిస్తే నా స్నేహితుడైన కర్ణుణ్ణి సైన్యాధ్యక్షుణ్ణి చేసేవాడిని అని తాతగారు అని కూడా చూడకుండా అనరాని మాటలు అన్నాడు. భిష్మాచార్యులవారు తాను సైన్యాద్యక్ష పదవి చేపట్టకముందు చెప్పిన షరతులు దుర్యోధనుడికి గుర్తు చేశారు. అయినప్పటికీ దుర్యోధనుడు భీష్మాచార్యులవారిని అనరాని మాటలు అన్నాడుఅతని మాటలకి ప్రత్యుత్తరముగా రేపు నా యుద్ధ పాటవాన్ని చూద్దువుగాని అన్నారు.

 మరునాటి యుద్ధములో భీష్మాచార్యులవారి విఝృంభణకి పాండవ సైన్యం అంతా కకావికలమై పోయింది. ఎవ్వరూ భీష్మునికి ఎదురు నిలబడలేక పోయారు. అర్జనుణ్ణి విపరీతంగా నొప్పించి అతని శరీరమంతా నెత్తురు కారేటట్లు చేసారు. తన చెలికాడు, తన భక్తుడు,ధర్మ దీక్షా పరుడు, తాను రధ సారధ్యం చేస్తుండగా ఇలాంటి అవస్థా అని తలచి  అర్జనుడు అచేతనుడై పోయి ఉన్న స్థితిని గమనించిన కృష్ణపరమాత్మ పగ్గాలని రధపు నొసలుకి కట్టి ఒక్క ఉదుటని దూకాడు. అతని ధాటికి భూమి కంపించింది. సుదర్శనాన్ని స్మరించి దానిని ధరించి  భీష్ముని వైపు కదిలాడుసుదర్శన చక్రపు కాంతులు కురుక్షేత్ర యుద్ధభూమిని కమ్మేశాయి. అంటే భీష్ముడు యుద్ధాన్ని ఆపడానికి అడ్డుకోవడానికి భగవంతుడే దిగి రావలసి వచ్చింది. దుర్యోధనుడికి విషయం అర్ధమవ్వాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం ధరించాడు. ఇదీ అసలు ధర్మ సూక్ష్మము. అంతేకాని అర్జనుడు చేతకాని వాడైతే కృష్ణుడు ఆయుధం పట్టలేదు. ఇది మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన రహస్యంఈ ఘట్టాన్ని బ్రహ్మశ్రీ చాగంటి వారు వర్ణించి చెప్పిన పద్ధతి సభికుల అందరి గుండెల్లో నిలిచి పోయింది. మహాభారతంలో పాత్రలు శీర్షికన జరుగుతున్న ప్రవచనాలు తిరిగి మళ్ళీ 16వ తేదీన అని ప్రకటించి ఉన్నారు.

Saturday, 13 August 2016

భీష్మాచార్యులవారి యుద్ధ నిపుణత

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారి నేటి ప్రవచనం(11/08/2016 )  అత్యంత రమణీయముగా జరిగిందికురుక్షేత్ర సంగ్రామములో భీష్మాచార్యులవారి యుద్ధ నిపుణత కౌశలము 3వనాటి యుద్ధములో అరివీర భయంకరుడై చెలరేగి చేసిన యుద్ధము, దానిని చూసి కృష్ణుడు సుదర్శన చక్రధారి యై భీష్ముని సమ్హరిస్తాను అని రధము పై నుండి దూకి వెళ్తుంటే అర్జనుడు పరుగు పరుగున వచ్చి కృష్ణుని ప్రాధేయపడి వెనక్కి తీసుకు రావడం బహు రమణీయముగా ప్రవచించినారు.

 ఇక్కడ ఒక సందేహము. అర్జనుడు యుద్ధము పూర్తి సామర్ధ్యాలతో చెయ్యలేక పోయాడా?... ఆయుధం పట్టను అని చెప్పిన కృష్ణుడు ఆయుధం పట్టడం ధర్మ విరుద్ధం కాదా??.. అసలు వీటి వెనుక యేమైనా ఉందా.. ఉంటే సూక్ష్మ రహస్యము యేమిటి?