బ్రహ్మశ్రీ
చాగంటి కోటేశ్వర
శర్మ గారి
నేటి ప్రవచనం(11/08/2016
) అత్యంత
రమణీయముగా జరిగింది. కురుక్షేత్ర సంగ్రామములో
భీష్మాచార్యులవారి యుద్ధ నిపుణత
కౌశలము 3వనాటి
యుద్ధములో అరివీర భయంకరుడై చెలరేగి చేసిన
యుద్ధము, దానిని చూసి కృష్ణుడు సుదర్శన
చక్రధారి యై భీష్ముని సమ్హరిస్తాను అని
రధము పై
నుండి దూకి
వెళ్తుంటే అర్జనుడు పరుగు పరుగున వచ్చి
కృష్ణుని ప్రాధేయపడి వెనక్కి తీసుకు రావడం
బహు రమణీయముగా
ప్రవచించినారు.
ఇక్కడ
ఒక సందేహము.
అర్జనుడు యుద్ధము పూర్తి సామర్ధ్యాలతో చెయ్యలేక
పోయాడా?... ఆయుధం పట్టను అని చెప్పిన
కృష్ణుడు ఆయుధం పట్టడం ధర్మ విరుద్ధం
కాదా??.. అసలు వీటి వెనుక యేమైనా
ఉందా.. ఉంటే
ఆ సూక్ష్మ
రహస్యము యేమిటి?
No comments:
Post a Comment