కురుక్షేత్ర యుద్ధము మోదలైన
తరువాత రెండవ
రోజు యుద్ధములో
పాండవులు అత్యుత్సాహముతో యుద్ధం చేస్తున్నారు. ఆ
సమయములో వారికి
దుర్యోధనుడు కనపడ్డాడు. అతణ్ణి చూడగానే భీముడు
అరివీర భయంకరుడిలా
విరుచుకు పడ్డాడు. దుర్యోధనుడి ఆయుధాలని విరిచెయ్యడమే
కాకుండా అతడు
స్పృహ కోల్పోయేటట్లు
చేశారు. అప్పుడు
సారధి రధిని
రక్షించుకోవడానికి రధాన్ని యుద్ధభూమి
నుండి తప్పించాడు.
ఆరోజు యుద్ధం
పూర్తి అయింది.
ఆనాటి రాత్రి
దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని ఉద్దేసించి మాట్లాడుతూ
మీరు పాండవ
పక్షపాతులు అందుకే వారు విజౄంభిస్తుంటే మిన్నకుండి పోయారు. కనీసం రాజైన
నన్ను రక్షించలేని
స్థితిలో ఉన్నారు… మిమ్ములను నమ్ముకుని
నేను యుద్ధానికి
వచ్చాను. మీగురించి ముందే తెలిస్తే నా
స్నేహితుడైన కర్ణుణ్ణి సైన్యాధ్యక్షుణ్ణి
చేసేవాడిని అని తాతగారు అని కూడా
చూడకుండా అనరాని మాటలు అన్నాడు. భిష్మాచార్యులవారు
తాను సైన్యాద్యక్ష
పదవి చేపట్టకముందు
చెప్పిన షరతులు
దుర్యోధనుడికి గుర్తు చేశారు. అయినప్పటికీ దుర్యోధనుడు
భీష్మాచార్యులవారిని అనరాని మాటలు
అన్నాడు. అతని
మాటలకి ప్రత్యుత్తరముగా
రేపు నా
యుద్ధ పాటవాన్ని
చూద్దువుగాని అన్నారు.
మరునాటి
యుద్ధములో భీష్మాచార్యులవారి విఝృంభణకి
పాండవ సైన్యం
అంతా కకావికలమై
పోయింది. ఎవ్వరూ భీష్మునికి ఎదురు నిలబడలేక
పోయారు. అర్జనుణ్ణి
విపరీతంగా నొప్పించి అతని శరీరమంతా నెత్తురు
కారేటట్లు చేసారు. తన చెలికాడు, తన భక్తుడు,ధర్మ దీక్షా పరుడు, తాను రధ సారధ్యం చేస్తుండగా ఇలాంటి అవస్థా అని తలచి అర్జనుడు అచేతనుడై పోయి
ఉన్న స్థితిని
గమనించిన కృష్ణపరమాత్మ పగ్గాలని రధపు నొసలుకి
కట్టి ఒక్క
ఉదుటని దూకాడు.
అతని ధాటికి
భూమి కంపించింది.
సుదర్శనాన్ని స్మరించి దానిని ధరించి
భీష్ముని వైపు కదిలాడు. సుదర్శన చక్రపు కాంతులు కురుక్షేత్ర యుద్ధభూమిని కమ్మేశాయి. అంటే భీష్ముడు
యుద్ధాన్ని ఆపడానికి అడ్డుకోవడానికి
భగవంతుడే దిగి రావలసి వచ్చింది. దుర్యోధనుడికి
ఈ విషయం
అర్ధమవ్వాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం ధరించాడు.
ఇదీ అసలు
ధర్మ సూక్ష్మము.
అంతేకాని అర్జనుడు చేతకాని వాడైతే కృష్ణుడు
ఆయుధం పట్టలేదు.
ఇది మనమందరం
గుర్తు పెట్టుకోవాల్సిన
రహస్యం. ఈ ఘట్టాన్ని బ్రహ్మశ్రీ చాగంటి వారు వర్ణించి చెప్పిన పద్ధతి సభికుల అందరి గుండెల్లో నిలిచి పోయింది. మహాభారతంలో పాత్రలు శీర్షికన జరుగుతున్న ప్రవచనాలు తిరిగి మళ్ళీ 16వ తేదీన అని ప్రకటించి ఉన్నారు.
No comments:
Post a Comment