Saturday, 20 August 2016

భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మములు చెప్పుట

05/2016 నుండి మహభారతంలో వివిధ పాత్రలు అనే శీర్షిక క్రింద బ్రహ్మశ్రీ చాగంటి కోతేశ్వరరావు గారు చేస్తున్న ప్రవచన కార్యక్రమము లో భీష్మాచార్యులవారి గురించి వారు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మములు చెపుతున్న (శాంతి పర్వము) సంఘటన జరుగుతోంది. భీష్మ పితామహులు ధర్మరాజుతో ఆశ్రమ ధర్మాలు చెబుతున్నారు. 1. బ్రహ్మచర్యాశ్రమము, 2. గృహస్తాశ్రమము, 3.వానప్రస్థాశ్రమము, 4. సన్యాశాశ్రమము. ఈ నాలుగు ఆశ్రమములలోను అత్యంత ఉత్తమమైన ఆశ్రమము గృహస్తాశ్రమము. మిగిలిన మూడు ఆస్రమములు ఈ గృహస్తాశ్రమముని ఆశ్రయించే ఉంటాయి. గృహస్తు విత్తము ఆర్జించి, ఆ ధనాన్ని 5భాగములు చేసి 1భాగము ధర్మముకొరకు, రెండవభాగము కీర్తికొరకు, మూడవది లోకిక వ్యవహారముల కొఱకు, నాలగవ భాగము తన కొరకు అంటే తన జీవుని ఉధరణ కొరకు, అయిదవ భాగము స్వజనుల కొరకు.  
  భీష్ముడు ధర్మరాజుతో రాజా ఇవన్నీ ఎవరి వలన వృద్ధి చెందుతాయో తెలుసా.. అవి రాజు వలననే వృద్ధి చెందుతాయి. అని రాజుకు ఉండవలసిన గుణములు చెబుతాడు.

No comments:

Post a Comment