Wednesday, 19 October 2016

నెగటివ్ ఎనర్జీ మీ* *ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎం చేయాలో చూడండి.

               *మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఇవి పాటించండి!!*
ప్రతీ ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలనే అనుకుంటారు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్య, పిల్లలు.... ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. అంతా బానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమైఉండచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమైఉండచ్చు.
       *ఇలాంటి నెగటివ్ ఎనర్జీ మీ* *ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎం చేయాలో చూడండి..!*
*ముందు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనడానికి కారణాలు చూడండి:*
* ఇంట్లోవారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
* అన్నిటికి తప్పు బడుతున్నారా? మీ ఇంట్లోవారు ఏ పని చేసిన అందులో తప్పులు వెతకడం.. లేదా మీ పై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
*ఒకే ఇంట్లోఉన్న అన్నతమ్ములని తండ్రి కొడుకులని విడగొట్టడం వలనకూడా నెగిటివ్ ఎనర్జి ఉన్నట్లే.
* తరచుగా ఎవరో ఒకరిపై చిన్న చిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
*మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండడానికి కారణాలు ఏంటో చూడండి:*
* ఇంట్లో వస్తువులు గాని, బట్టలు గాని ఎలాపడితే అల వదిలేయకూడదు. వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
*ఇంటిముందు ప్రతీనిత్యం మంచివి పెద్దముగ్గులను వేయాలి చెత్తచెదారాలను ఎక్కడబడితే అక్కడ వేయరాదు ఒకవేళ అలాచేస్తే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే.
* మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి. చేతులో పట్టుకొని అటు ఇటు తిరిగితే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
* మురికి బట్టలు ధరించకూడదు. వీటివల్ల క్రిములు రావడమే కాకుండా వస్తు ప్రకారం ఈ బట్టలు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
* ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురుబొదురుగా అస్సలు ఉంచకూడదు. వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి. పక్కపక్కన పెట్టచ్చు గాని ఎదురుబొదురుగా పెడితే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
*నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమికోట్టాలో చూడండి:*
* ఓ గుప్పెడు రాయిఉప్పు లేదా దొడ్డుఉప్పుని అన్ని రూమ్ మూలలలో పెట్టండి. 48 గంటల తరువాత దాన్ని తీసేయండి. నెగటివ్ ఎనర్జీ తరిమికొట్టడంలో రాయిఉప్పు బాగా పనిచేస్తుంది. కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి.
* ఇంటిని, ఇంట్లో వస్తువులని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్.. ఇలా అన్నిటిని కనీసం రెండు వారాలకొకసారైనా శుభ్రపరుచుకోండి.
* పాత పుస్తకాలు, దుస్తులు లాంటివి ఉంచుకోకండి. కుదిరితే ఎవరికైనా దానం చేయండి. ఎంత తక్కువ వస్తువులు ఉంటె అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
* నిశాభ్ధంగా ఉంటె చాలా మందికి నచ్చుతుంది. కాని అప్పుడప్పుడు ఫుల్ సౌండ్ తో పాటలు వినడం లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే నెగటివ్ ఎనర్జీ అక్కడనుండి పారిపోతుంది.
* తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఈగలొస్తాయి. దోమలోస్తాయి అని అలా చేయకుండా ఉండకండి. ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
* మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదు... మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. దీంతో మీ ఇంటి పై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఏదైనా సూర్య కాంతి పడే మంచి స్థలం చూసుకొని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది.
* ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ కాండిల్స్ వెలిగిస్తూ ఉండాలి. ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది.
* మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎల్లపుడు ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మార్చండి. సోఫాల పైన ఉన్న క్లాత్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
* హాల్ లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంట్లో చెట్లని చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి.
* ఇంట్లో అక్కడక్క వెల్లులి రెమ్మలను తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్ కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి.
* క్రిస్టల్స్ ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి.
Curtesy. Mani

Tuesday, 18 October 2016

దసరా

                 ఏ పండుగ అయినా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ అమ్మవారి పండుగ సంవత్సరానికి రెండుమార్లు వస్తుంది. ఎలాగ అంటే, ----చైత్రమాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంతనవరాత్రులు ఒకసారి...... ఆశ్వీయుజ మాసంలో పాడ్యమి నుండి విజయదశమి వరకు శరన్నవరాత్రులు మరొకసారి ..... జరుగుతాయి.
          మాసాల్లో మొదటిది చైత్రమాసం, నక్షత్రాలలో మొదటిది అశ్విని. చైత్రమాసంలో నవరాత్రులను వసంతనవరాత్రులు అని, నక్షత్రాలలో మొదటిది అయిన అశ్విని ప్రధానంగా ఉండే ఆశ్వీయుజమాసంలో నవరాత్రులను శరన్నవరాత్రులు అని,  రెండుమార్లు నవరాత్రులను జరుపుకుంటాము. ఒకటి ఉత్తరాయణంలో ...... మరొకటి దక్షిణాయనంలో రావటం మరొక విశేషం.
మరో విశేషం కూడా ఉంది. చైత్రమాసపు నవరాత్రులు అశ్వినీ నక్షత్రంతో ప్రారంభమైతే, అశ్వినీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే ఆశ్వీయుజమాసపు నవరాత్రులు చిత్తా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మరొక విశేషం ఏమిటంటే ...... నక్షత్రాలు 27 లో మొదటిది అశ్విని అయితే సరిగ్గా మధ్యగా వుండే నక్షత్రం చిత్త. అలాగే మాసాల్లో 12 లో మధ్యగా వుండే మాసం ఆశ్వీయుజం. ఆరింటిలో మొదటిది చైత్రమాసం అయితే..... మధ్యగా ఉండే మాసం ఆశ్వీయుజం...... అదే విధంగా ఋతువులలో మొదటిది వసంతమైతే ... మధ్యది శరదృతువు.
ఇది అంతా ఎందుకు అంటే... అమ్మవారు ఆదిలోనూ, మధ్యలోనూ కూడా పూజింపబడే విధంగా ఏర్పాటుచేసుకొని మనల్ని అనుగ్రహించాలి అనే కరుణాబుద్ధి కలిగి ఉంది అని తెలియచేయటానికే. తిథులు 30 లో కూడా పూర్ణిమ వరకు పూజింపబడేది అమ్మ (ఆదిశక్తి) యే. (ప్రతిన్ముఖ రాకాంత తిథి మండల పూజితా).
ఇలా ఆయన -- ఋతువు -- మాస --- పక్ష --- తిథులలో రెండుమార్లు పూజింపబడుతూ తొమ్మిదిరోజులపాటు మరి ఏ ఇతర దైవానికీ పూజలు జరగనేజరుగవు.
         యోగం అనేది మొత్తం కుండలినీశక్తికి సంబంధించి ఉంటుంది. "కుండలినీ" అనే శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం. కాబట్టి ఈ కుండలినీ శక్తినీ సాధించదలచి యోగాన్ని ప్రారంభించిన వ్యక్తికి కలిగే అనుభవాలన్నిటినీ క్రమంగా ఒక స్త్రీలో కలిగే మార్పులుగా వర్ణించి చెప్పారు మన (పూర్వీకులు) పెద్దలు.
ఆ కారణంగా అమ్మవారి తొమ్మిది అవతారాల్లో సాధకునికి క్రమక్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిదిదశల్లో ఉంటుందని ప్రాచీనులు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకుడు "దశ" అవస్థనాటికి విజయాన్ని సాధించి సిద్ధినిపొంది సిద్ధుడౌతాడు. ఆ సిద్ధినే "విజయ(దశమి)సిద్ధి"  అంటారు.
నవరాత్రులలో ప్రతిరోజూ దేవికి వేసిన ఒక్కొక్క అవతారాన్ని(ఒక్కొక్క అలంకారాన్ని) సాధన చేసే సాధకుని ఒక్కొక్క మెట్టు అభివృద్ధుగా గమనించాలని మనం భావించాలి. ప్రతిరోజూ అమ్మవారి అలంకారాన్ని చూసి రావాలనే నియమాన్ని విధించింది  కూడా ఇందుకే..... సాధకుని ప్రతీ దశలోనూ అభివృద్ధిని గమనిస్తూ ఉండాలనే రహస్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికే ఇవన్నీను.


Curtesy: Mani, vizag

Sunday, 16 October 2016

వ్యాకరణంలో

వ్యాకరణంలో సంబాషణ!
.
ఈ కథ చాలా పాతకాలందిలెండి.!
ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు . త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో .
పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.
దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ
మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?అన్నాడు నవ్వుతూ
షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది
కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.
(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?)
ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి.
(అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.
యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.
....
ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.
ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.శిష్యుడు అతడి భార్య
ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.అప్పుడు గురువు
ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.
అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి
వెళ్ళుట మీకు న్యాయమేనా?అన్నాడు. గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే
నీకు యేమీ అపకారము చెయ్యదు.పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.పంచమీ తత్పురుషము
లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.
పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు
ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.
ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు.
అందుకు గురువు గారు నవ్వుతూ
నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.ద్వంద్వా తీతుడంటే
మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.

Thursday, 6 October 2016

మంచి కధ.. చదవండి..!!

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది. 
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. 
ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో⚡బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు."చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.... 
ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు"నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై...అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.
కాని, ఆ పుణ్యఫలం 
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు! 
🔸పిల్లలది కావచ్చు! 
🔸తోబుట్టువులది కావచ్చు! 
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా 
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. 
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఒక సినిమాలో చెప్పినట్లు..."బాగుండడం" అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.
ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము🙏.

కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము🙏.

curtesy: Mani, vizag